ఈ ఏడాదిలో కమల్ చిత్రాలు మూడు

24 Jun, 2014 23:59 IST|Sakshi
ఈ ఏడాదిలో కమల్ చిత్రాలు మూడు
విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఆ తరువాత ఏడాది దాటి నా కొత్త చిత్రం ఏదీ ఇంత వరకు తెరపైకి రాలేదు. అయితే ఆయన ఈ ఏడాది మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ మూడు చిత్రాలు రానున్న ఈ ఆరు నెల ల్లోనే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వరూపం తరువాత కమల్ దానికి సీక్వెల్‌గా విశ్వరూపం-2 చిత్రం చేశారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది.
 
 ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం రమేష్ అరవింద్ దర్శకత్వంలో దర్శక, నిర్మాత, లింగుసామి నిర్మిస్తున్న ఉత్తమ విలన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా పూర్తి అయ్యింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్న ట్లు కమల్ ఒక ఇంట ర్వ్యూలో తెలిపారు. ఆయన మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన దృశ్యం చిత్రం తమిళ రీమేక్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నారు.
 
 ఈ చిత్ర షూటిం గ్ జూలైలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు దర్శకుడు జీతు జోసెఫ్ తెలి పారు. మలయాళంలో దృశ్యం చిత్రానికి దర్శకత్వం వహించిన ఈయన తమిళ చిత్రానికి పని చేయనున్నారు. నటి గౌతమి హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాల తారాగణం, సాం కేతిక బృందం ఎంపిక జరుగుతోంది. చిత్రాన్ని జూలై రెండో వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా తమిళంలో పేరు నిర్ణయిం చని ఈ చిత్రం ఈ ఏడాదిలోనే తెరపైకి రానున్నట్లు సమాచారం. మొత్తం మీద ఆరు నెలల్లో కమ ల్ నటించిన మూడు చిత్రాలు తెరపై రానున్నాయన్నమాట. ఇదే గనుక జరిగితే కమల్ హాసన్ నట జీవితంలో ఇది ఒక రికార్డ్‌నే అవుతుంది.