పీఎం కిసాన్ యోజన ఆర్థిక సాయం పెంపు
‘ఉజ్వల’గ్యాస్ సిలిండర్పై రూ.450 సబ్సిడీ
రాజస్తాన్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీలు
విడుదల చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీకి ఈ నెల 25న జరగనున్న ఎన్నికలకు బీజేపీ గురువారం మేనిఫోస్టోను విడుదల చేసింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకిచ్చే వంటగ్యాస్ సిలిండర్పై రూ.450 చొప్పున సబ్సిడీ, వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పీఎం కిసాన్ యోజన కింద రైతులకిచ్చే ఆర్థిక సాయం పెంపు వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ మేరకు మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను బీ జేపీ చీఫ్ జేపీ నడ్డా గురువారం జైపూర్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రశ్నపత్రాల లీకేజీతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు.
సంకల్ప పత్రలోని మరికొన్ని హామీలు..
మహిళలు, బాలికల కోసం...
యువత కోసం..
ఆరోగ్యరంగంలో..
వీటితోపాటు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, జైపూర్ మెట్రో విస్తరణ, పారదర్శక బదిలీ విధానం, పేద కుటుంబాలకు ఉచిత రేషన్, దివ్యాంగులకు రూ.1,500 పింఛను, వృద్ధాప్య పింఛను పెంపు వంటివి ఉన్నాయి. ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 350 బిలియన్ డాలర్లకు పెంచుతామని వాగ్దానం చేసింది. జైపూర్, ఉదయ్పూర్, కోటా, అజీ్మర్, జోథ్పూర్, బికనీర్లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడాన్ని కూడా మేనిఫెస్టో పేర్కొంది. ఓబీసీలకు నిర్ణిత వ్యవధిలో ధ్రువీకరణ పత్రాల జారీ, వారికి రూ.15 వరకు విద్యారుణం. ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు. ఇవి కాకుండా, ఎస్సీ,ఎస్టీలు, గిరిజనులు, వీధి వ్యాపారులు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి.