కొత్తవాళ్ల ప్యాషన్‌ చూస్తుంటే ముచ్చటేసింది

15 Jul, 2018 01:58 IST|Sakshi
రవికిశోర్, తనికెళ్ల, జేయస్‌ నిథిత్, అమర్‌

తనికెళ్ల భరణి  

‘‘ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వేరే రంగాల్లో విజయం సాధిస్తున్నప్పటికీ మానసిక సంతృప్తి కోసం సినిమా రంగంలోకి వస్తున్నారు. వాళ్లందరూ తప్పకుండా విజయం సాధిస్తారు. ‘అంతర్వేదమ్‌’ చిత్రంలో నటించినవారు, యూనిట్‌ మెంబర్స్‌ అందరూ కొత్తవారే. సినిమా పట్ల వారి ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది’’ అని రచయిత–నటుడు తనికెళ్ల భరణి అన్నారు. అమర్, సంతోషి, శాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అంతర్వేదమ్‌’.

చందిన రవికిశోర్‌ దర్శకత్వంలో ఫ్రెండ్స్‌ ఫండింగ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై క్రౌడ్‌ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది. జె.యస్‌. నిథిత్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. రవికిషోర్‌ మాట్లాడుతూ– ‘‘నేను చెప్పిన కథ నచ్చి తనికెళ్ల భరణిగారు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ అందరూ ఇప్పటి వరకూ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. చిత్రకథానాయకుడు అమర్, రైటర్‌ ప్రసన్నకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటులు రాంప్రసాద్, ‘రైజింగ్‌’ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివ దేవరకొండ, సహ నిర్మాత: ఎస్‌.ఎన్‌.

మరిన్ని వార్తలు