అఘోరాలతో అరుంధతి పోరు

14 Jul, 2018 02:02 IST|Sakshi
అర్చన మోసాలి

ప్రముఖ మోడల్‌ మిస్‌ కర్ణాటక అర్చన మోసాలి ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరుంధతి అమావాస్య’. కె.వంశీధర్‌ సమర్పణలో శ్రీకృష్ణ శంకర్‌ ప్రొడక్షన్స్‌పై కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్‌  కానుంది. తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘అరుంధతి, అఘోరాల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది.

అమావాస్య రోజున ముగిసే ఈ పోరాటంలో పలు మలుపులుంటాయి. ఇందులో ఓ పాము ప్రధాన పాత్ర పోషించింది.  అమ్మోరు, అరుంధతిలా ప్రేక్షకులకు కొత్త ఫీల్‌ కలిగిస్తుంది’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేలా  తోట కృష్ట ఈ చిత్రం తెరకెక్కించాడు’’ అన్నారు కోటేశ్వర రావు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మంచాల రమేష్‌ యాదవ్, సహ నిర్మాత: కె వింధ్యారాణి.

మరిన్ని వార్తలు