బాలీవుడ్ ప్రముఖలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలీవుడ్ తారలు రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, కరణ్ జోహర్లతోపాటు మరికొందరు ప్రముఖులు గురువారం ఢిల్లీలో మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమలోని పలు సమస్యలపై మోదీతో చర్చించారు. ఈ సమావేశం సందర్భంగా బాలీవుడ్ నటీనటులు మోదీతో కలిసి దిగిన ఫొటోను కరణ్ జోహార్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ ఫొటోలో మోదీ తారల మధ్య నవ్వులు చిందింస్తూ కనిపించారు.
ఈ రోజు ప్రధాని మోదీని కలవడం అద్భుతమైన అవకాశమని కరణ్ జోహర్ న్నారు. చర్చల ద్వారా గొప్ప మార్పు సాధించవచ్చని.. తాము దాని కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఒక కమ్యూనిటీగా దేశ ప్రగతి కోసం కృషి చేయాలనే ఆసక్తి తమకు ఉందన్నారు. సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు.