త్రిషతోనే నా పెళ్లి....

7 Nov, 2015 09:31 IST|Sakshi
త్రిషతోనే నా పెళ్లి....

చెన్నై : త్రిష ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఆ మధ్య నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో ప్రేమ, ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్ ...బ్రేకప్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నటి చార్మీ, నికీషా పటేల్‌తో కలిసి ఆమె స్నేహమంటే ఇదేరా అన్నంత జోష్‌లో తుళ్లిపోతూ మరోసారి సంచలనం సృష్టించింది.  స్వేచ్ఛా విహంగంగా జీవించే ఈ ముగ్గురు 'రమ్‌' అనే చిత్రంలో నటిస్తున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం పొంగి పొర్లుతోంది. ఇటీవల ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ట్విట్టర్‌లో జరిపిన ముచ్చట్లు అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.

వారు ముగ్గురు అదిరే దుస్తులు ధరించి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెల్పీ ఫోటోలను నటి త్రిష తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను చూసిన నికీషా పటేల్ ...త్రిషను పొగడ్తలతో ముంచేస్తూ తన ట్విట్టర్‌లో పేర్కొంది.  ఇక నటి ఛార్మీ అయితే త్రిషతోనే నా పెళ్లి, ఆమెతోనే డేటింగ్ చేస్తా అంటూ రెచ్చిపోయింది. ఇవన్నీ అభిమానుల్ని పిచ్చపిచ్చగా ఎంటర్ టెయిన్ చేస్తున్నాయి.

>