హీరోగా చిత్తూరు నాగయ్య మనుమడు

4 Apr, 2015 22:30 IST|Sakshi
హీరోగా చిత్తూరు నాగయ్య మనుమడు

తెలుగు తెర తొలి సూపర్‌స్టార్ చిత్తూరు వి. నాగయ్య సోదరుని మనుమడు దృహిణ్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. దృహిణ్, సుమ జంటగా శ్రీభక్త మార్కండేయ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్ గోయల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. టి. రాము దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ముహూర్తపు షాట్‌కు సి.హెచ్. సంజీవయ్య కెమెరా స్విచాన్ చేయగా, సి.చిన్నారెడ్డి క్లాప్ కొట్టారు. చిత్తూరు నాగయ్య మనుమడిని హీరోగా పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ .