రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన హరీష్‌ శంకర్‌

4 May, 2019 10:04 IST|Sakshi

మాస్‌ పల్స్‌ తెలిసిన డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌.. ‘దబాంగ్‌’ రీమేక్‌ ‘గబ్బర్‌సింగ్‌’తో తిరుగులేని హిట్‌ కొట్టాడు. చివరగా డీజే సినిమాను తీసి పర్వాలేదనిపించిన ఈ డైరెక్టర్‌ ప్రస్తుతం వాల్మీకి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా హరీష్‌ శంకర్‌ పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీయబోతున్నాడని, అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నారని, వాల్మీకి చిత్రంలో పూజాహెగ్డే ఎక్కువ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసిందని వార్తలు వినిపించాయి. వీటిపై హరీష్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో స్పందించాడు.

కొన్ని వార్తలు వైరల్‌ అవుతున్న కారణంగా వాటిపై క్లారిటీ ఇవ్వడం తన బాధ్యత అంటూ.. ‘పూజాహెగ్డే రెమ్యూనరేషన్‌పై వస్తున్న వార్తలు నిజం కాదు.. మీ అందరికీ తెలుసు నాకు పవన్‌ కల్యాణ్‌ను డైరెక్ట్‌ చేయడం అంటే ఇష్టమని.. అయితే నేను రీసెంట్‌గా నేను ఆయన్ను కలిసినట్టు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు’ అంటూ క్లారిటీ ఇస్తూ... తన నుంచి గానీ, నిర్మాతల నుంచి గానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు సినీ అభిమానులందరూ ఎదురుచూడాలంటూ రిక్వెస్ట్‌ చేశాడు. అయితే పవన్‌తో సినిమాతో ఉంటుందా? అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. హరీష్‌ చెప్పినట్లు.. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు ఎదురుచూడాల్సిందే.

>
మరిన్ని వార్తలు