నా నవ్వులో నువ్వున్నావమ్మా : జాన్వీ

24 Feb, 2019 12:23 IST|Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి సంవత్సరం అవుతున్నా.. ఇప్పటికీ అభిమానులు ఆమెను మరిచిపోలేకపోతున్నారు. ఇక వారి కుటుంబ సభ్యుల పరిస్థితీ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ముఖ్యంగా శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ ప్రతీ సందర్భంలోనూ తల్లి పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం శ్రీదేవి తొలి వర్థంతి సందర్భంగా మరోసారి అమ్మతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జాన్వీ.

‘నా మనసు ఎప్పుడూ భారంగానే ఉంటుంది. అయినా నేను నవ్వుతూనే ఉంటాను. ఎందుకంటే ఆ నువ్వులోనే నువ్వున్నావ్‌..’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్‌ చేశారు జాన్వీ. ఈ కామెంట్‌తో పాటు తన చేతిని శ్రీదేవి పట్టుకున్న ఫోటోను షేర్‌ చేశారు. కూతురిని వెండితెర మీద చూసుకునేందుకు ఎంతగానో తాపత్రేయ పడ్డ శ్రీదేవి ఆ కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు.

My heart will always be heavy. But I’ll always be smiling because it has you in it.

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

మరిన్ని వార్తలు