చలో ఉక్రెయిన్‌

28 Jul, 2018 04:47 IST|Sakshi
రకుల్‌ప్రీత్‌ సింగ్

లండన్‌కు బై బై చెప్పారు కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. నెక్ట్స్‌ ఉక్రెయిన్‌కు వెళ్తారామె. అకివ్‌ అలీ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్, రకుల్‌ప్రీత్‌ సింగ్, టబు ముఖ్య తారలుగా హిందీలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా నెల రోజుల లాంగ్‌ షెడ్యూల్‌ కోసం లండన్‌ వెళ్లారు రకుల్‌. ‘‘లండన్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ‘దేవ్‌’ సినిమా కోసం ఉక్రెయిన్‌ వెళ్తున్నాను. హిందీ టు తమిళ్‌’’ అని పేర్కొన్నారు రకుల్‌. కార్తీ హీరోగా రజత్‌ రవిశంకర్‌ దర్శకునిగా పరిచయం అవుతున్న తమిళ చిత్రం ‘దేవ్‌’. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవ్వడానికే రకుల్‌ ఉక్రెయిన్‌ వెళ్తున్నారు. ‘దేవ్‌’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని సమాచారం.

మరిన్ని వార్తలు