కొత్త బిజినెస్‌?

14 Apr, 2020 03:18 IST|Sakshi
మహేశ్‌బాబు

మల్టీప్లెక్స్‌ (ఏఏమ్‌బీ మల్టీప్లెక్స్‌), టైక్స్‌టైల్‌ (హంబుల్‌) రంగాల్లో నటుడు–నిర్మాత మహేశ్‌బాబు వ్యాపారవేత్తగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఒక ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) ప్లాట్‌ఫామ్‌లో వ్యాపార భాగస్వామి కాబోతున్నారట. ఇందుకోసం మహేశ్‌ ముంబైలోని ఓ పెద్ద నిర్మాణ సంస్థతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని భోగట్టా. నిర్మాత అల్లు అరవింద్‌ ఇటీవల ‘ఆహా’ పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేశ్‌ కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. డిజిటల్‌ వైపు ఇంకెంతమంది స్టార్స్‌ మొగ్గుచూపుతారో చూడాలి.

మరిన్ని వార్తలు