కార్తీ, సాయిపల్లవితో మణి సినిమా

5 Mar, 2016 23:22 IST|Sakshi
కార్తీ, సాయిపల్లవితో మణి సినిమా

‘ఓకే బంగారం’ తర్వాత మణిరత్నం చేయబోయే సినిమా దాదాపు ఖరారైనట్లే. యుగానికి ఒక్కడు, ఆవారా తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన తమిళ హీరో కార్తీతో ఆయన ఈ సినిమా చేయనున్నారు. ఎ.ఆర్. రహమాన్ ఆధ్వర్యంలో పాటల రికార్డింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇందులో మొత్తం ఏడు పాటలు ఉంటాయట. కార్తీ సరసన మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం సాయి పల్లవిని కథానాయికగా తీసుకున్నారట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.