ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముగిసినా ఫలితాలు వెలువడటానికి మే 23వ తేదీ వరకూ వేచి చూడాల్సి రావడంతో సోషల్ మీడియాలో.... రకరకాల వార్తలు, కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ పార్టీల గెలుపు, ఓటములపై నెటిజన్లు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. అయితే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏకంగా ఓ అడుగు ముందుకేశారు. ఆయన తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు (చంద్రబాబు మెడలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పిన) ఓ మార్ఫింగ్ ఫోటోను రాంగోపాల్ వర్మ షేర్ చేశారు. ’వావ్ షాకింగ్ ట్విస్ట్, వైఎస్సార్ సీపీలో చేరిన సీబీఎన్’ అని క్యాప్షన్ పెట్టారు.
Wowwww in a shocking twist, just now CBN joined YSRCP. pic.twitter.com/wmY0VMzZJn
— Ram Gopal Varma (@RGVzoomin) 13 April 2019
అంతేకాకుండా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు సంబంధించిన ఓ వీడియోను కూడా వర్మ షేర్ చేశారు. కేఏ పాల్ ఓటు వేసి...పోలింగ్ బూత్ నుంచి బయటకు పరుగెత్తుకుంటూ రోడ్డు మీదకు వచ్చి డాన్స్ చేయడం...ఆయన వెనుక భద్రతా సిబ్బంది పరుగులు తీస్తున్న వీడియోను షేర్ చేసి... ‘గొలుసు వేసి కట్టేయకపోతే కరుస్తాడేమో’ అని వ్యాఖ్యానించారు.
Golusesi katteyyaka pothey karusthaademo? 🙄🙄🙄 pic.twitter.com/5MnpiIX24r
— Ram Gopal Varma (@RGVzoomin) 13 April 2019