చెన్నై : ఈ తరం హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్నే నమ్ముకుంటున్నారని చెప్పక తప్పదు. అలాంటి పాత్రలతోనే స్టార్డమ్ సాధ్యమని వారు గట్టిగా నమ్ముతున్నారు. నటి కీర్తీసురేశ్లా ఆదిలోనే నటనకు అవకాశం ఉన్న పాత్రలు అందరికీ అందడం సాధ్యం కాదు. దానికీ టైమ్ అంటూ ఒకటుంటుంది. అది వచ్చే వరకూ నటిగా సినిమాల్లో నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. అందుకే గ్లామర్ను ఆశ్రయించక తప్పదు. నటి రాశీఖన్నా ఇందుకు అతీతం కాదు. నిజానికి తెలుగులో ‘ఊహలు గుసగుసలాడె’చిత్రంలో ఈ బ్యూటీ చక్కని నటనను ప్రదర్శించి పేరుతెచ్చుకుంది. ఆ తరువాతనే రాశీఖన్నా తన రూటు మార్చుకుంది. అలా గ్లామర్గా నటించిన చిత్రాలేవీ ఆమె కేరీర్కు ఉపయోగపడలేదన్నది వాస్తవం. ఆ మధ్య వరుసగా యువ హీరోలతో నటించేసిన ఈ జాణకు ఇప్పుడు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
ప్రస్తుతం కోలీవుడ్నే ఆశలను ఊరిస్తోంది. ఇమైకా నొడిగళ్ చిత్రంతో తమిళసినిమాకు పరిచయం అయిన రాశీఖన్నాకు అంది మంచి రాశినే అనిపించింది. తరువాత జయంరవితో జతకట్టిన ‘అడంగుమరు’చిత్రం సక్సెస్ను అందించింది. దీంతో కోలీవుడ్లోనే రాశీఖన్నాకు ఆశాజనకంగా ఉంది. ఇప్పుడు విజయ్సేతుపతితో సంఘతమిళన్, సిద్ధార్థ్కు జంటగా సైతాన్ కా బచ్చా చిత్రాలతో పాటు మణికంఠన్ దర్శకత్వంలో కడైసీ వివసాయి అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఇలా టాలీవుడ్లో నటిగా పేరు తెచ్చుకుని కోలీవుడ్లో మకాం పెడుతున్న నటీమణుల లిస్టులో రాశీఖన్నా చేరిపోయింది. దీంతో స్టార్ హీరోలతో నటించాలని ఆశ పడుతున్న ఈ బ్యూటీ అలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అందుకు అందాలతో ఆకర్షించే పనులు చేపట్టింది. మంచి గ్లామరస్ ఫొటోలను అందం చూడవయా ఆనందించవయా అన్నట్టు తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొత్త అవకాశాలకు అలాంటి గ్లామర్ ట్రిక్స్ ఎలా పని చేస్తాయో చూడాలి మరి.