పిచ్చెక్కించే వినోదం

10 Feb, 2020 03:06 IST|Sakshi
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకునిగా మారారు. ఆయన తెరకెక్కించనున్న ‘ఆర్జీవీ’ అనే చిత్రం హైరదాబాద్‌లో ప్రారంభమైంది. ‘కార్తికేయ’ చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం సమర్పణలో మాగ్నస్‌ సినీప్రైమ్‌ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాల కుటుంబరావు పొన్నూరి మాట్లాడుతూ– ‘‘ఒక విద్యావేత్తగా పాఠాలు చెప్పి మంచిని బోధించే వృత్తిలో ఉన్న నాకు, జొన్నవిత్తుల గారు చెప్పిన కథ నచ్చడంతో సామాజిక బాధ్యతగా ఈ సినిమా నిర్మిస్తున్నా. ఇదొక మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత సమాజంలో కొందరు స్వేచ్ఛ పేరుతో యువతను తప్పుదోవ పట్టించే భావజాలాన్ని ఒక సిద్ధాంతంలా ఎక్కించారు. దీని వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. ఇందులో పిచ్చెక్కించే వినోదం ఉంటుంది. ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. మార్చి మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు