‘లవ్‌ యూ మామయ్య’

10 Jun, 2018 13:07 IST|Sakshi

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ తాజా చిత్రం ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’. నిన్న (జూన్‌ 9) జరిగిన ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ రాకతో ఈ ఫంక్షన్‌కు క్రేజ్‌ ఏర్పడింది. వేడుకలో చిరు ప్రసంగం కూడా అందరిని ఆకట్టుకుంది. కే ఎస్‌ రామారావు, తనకు మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకోవడం, తొలిప్రేమ సినిమా గురించి మాట్లాడుతూ పవన్‌ టాపిక్‌ తీయడం మెగా అభిమానులను అలరించింది. 

అయితే ఈ వేడుకకు హాజరైనందుకు చిరంజీవికి మెగా మేనల్లుడు ధన్యవాదాలు తెలియజేశారు. వేడుకలోనే ధన్యవాదాలు తెలిపినప్పటికీ మళ్లీ ఈ రోజు సోషల్‌ మీడియా వేదికగా తన కృతజ్ఞతలను తెలియజేశారు. ‘ థ్యాంక్యూ సో మచ్‌ మామయ్య.. మీరు ఫంక్షన్‌కు వచ్చి మా జీవితాల్లో నింపిన ఆనందాలను మా జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఉంటాం. లవ్‌ యూ మామయ్య- తేజ్‌ ఐ లవ్‌ యూ బృందం’ అంటూ భావోద్వేగంగా ట్వీట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు