షారూఖ్, పాతికేళ్లలో ఇదే తొలిసారి..!

11 Feb, 2017 13:26 IST|Sakshi
షారూఖ్, పాతికేళ్లలో ఇదే తొలిసారి..!

బాలీవుడ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఖాన్ త్రయం. ప్రస్తుతం బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ను సల్మాన్, షారూఖ్, ఆమిర్ ఖాన్లు శాసిస్తున్నారు. గతంలో ఈ ముగ్గురు ఖాన్ల మధ్య ఎన్నో వివాదాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ముగ్గురు ఒకరితో ఒకరు కలిసి మెలసి ఉంటున్నారు. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఆసక్తికర ట్వీట్ ఒకటి చేశాడు. శుక్రవారం రాత్రి జరిగిన పార్టీలో దిగిన ఓ అరుదైన ఫోటోను ట్వీట్ చేసిన షారూఖ్, ' ఒకరికొకరం పాతికేళ్లుగా తెలిసి తొలిసారిగా ఇద్దరం కలిసి దిగిన ఫోటో ఇదే' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో షారూఖ్తో పాటు ఉన్నది మరెవరో కాదు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. షారూఖ్తో పాటు దిగిన ఈ సెల్ఫీ ఫోటోలో ఆమిర్ పోడవాటి గడ్డంతో డిఫరెంట్గా కనిపిస్తున్నాడు.