అమ్మ నిర్మాత.. కొడుకు దర్శకుడు

21 Jun, 2016 18:24 IST|Sakshi
అమ్మ నిర్మాత.. కొడుకు దర్శకుడు

ముంబై: శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత బాల్ ఠాక్రే జీవితకథను వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాకు ‘సాహెబ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు బాల్ ఠాక్రే కోడలు స్మితా ఠాక్రే నిర్మాత కాగా, ఆయన మనవడు, స్మిత కొడుకు రాహుల్ దర్శకుడు కావడం విశేషం. బాల్ ఠాక్రే జీవితకథ ఆధారంగా తీస‍్తున్న ఈ సినిమాకు తన కొడుకు రాహుల్ దర్శకత్వం వహించడం తనకు సంతోషంగా ఉందని స్మిత చెప్పారు.

‘బాలాసాహెబ్ ఎప్పుడూ లెజండ్లా బతికారు. కుటుంబానికి, అనుచరులకు ఆయన ఓ ప్రశ్నలాంటి వారు. ఆయన జీవిత ప్రయాణంలో ఓ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాం. సాహెబ్ జీవితకథను తెరకెక్కించే బాధ్యతను ఆయన మనవడు రాహుల్ తీసుకున్నాడు’ అని స్మిత తెలిపారు. వచ్చే అక్టోబర్లో ఈ సినిమా ప్రారంభంకానుంది. నటీనటులను ఇంకా ఎంపిక చేయాల్సివుంది.