నైరోబీలో ఆడిపాడనున్న బాలీవుడ్ భామ

25 Aug, 2015 16:34 IST|Sakshi
నైరోబీలో ఆడిపాడనున్న బాలీవుడ్ భామ

నైరోబీ: బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్, ప్రముఖ సింగర్ షాన్ కెన్యా రాజధాని నైరోబీలో ఆడిపాడి అలరించబోతున్నారు. మ్యూజికల్ టూర్లో భాగంగా వారిద్దరు నైరోబీ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 5న నైరోబీలోని కార్నివోర్ గ్రౌండ్స్లో వారు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అల్లాఫ్రికా డాట్ కామ్ అనే సంస్థ తెలిపింది. ఇటీవల కాలంలో కాస్త సినిమాల వేగం తగ్గించిన ఈ నాయకి గత వారంలో ప్రముఖ దర్శకుడు, గాయకుడు ఫరాహ్ అక్తర్తో కలిసి నైరోబీలోనే పార్క్లాండ్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద ఓ మ్యూజికల్ షోను నిర్వహించిన విషయం తెలిసిందే. మరోపక్క ఆగస్టు 29, 30లో జరిగే కెన్యా వరల్డ్ వైడ్ ఫ్యాషన్ ఫియెస్టా 2015 కార్యక్రమంలో కూడా సన్నీ ప్రముఖ గాయని సోను శర్మతో కలిసి పాల్గొననుంది.

>