నాలుగోసారి...

17 Mar, 2020 00:38 IST|Sakshi

కొన్ని కాంబినేషన్స్‌ చాలా క్రేజీగా ఉంటాయి. అలాంటి  కాంబినేషన్స్‌లో సినిమాలు మళ్లీ మళ్లీ రావాలనుకుంటారు ప్రేక్షకులు. తమిళ హీరో విజయ్‌–దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌లది అలాంటి కాంబినేషనే. ఈ ఇద్దరి కాంబోలో ‘తుపాకి’, ‘కత్తి’, ‘సర్కార్‌’ సినిమాలు విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర  సంచలన విజయాలు నమోదు చేశాయి. ఈ మూడూ పక్కా కమర్షియల్‌ సినిమాలు. కానీ సందేశం కూడా ఉండేట్లుగా చూసుకున్నారు విజయ్, మురుగదాస్‌. ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందట.

‘సర్కార్‌’ చిత్రాన్ని నిర్మించిన సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విజయ్‌ నటించనున్న 65వ చిత్రమిది. ప్రస్తుతం విజయ్‌ హీరోగా నటించిన ‘మాస్టర్‌’ చిత్రం ఆడియో వేడుకను చిత్రబృందం సమక్షంలో జరపాలనుకుంటున్నారు. కరోనా కారణంగా భారీ వేడుక రిస్క్‌ అని యూనిట్‌ భావించింది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి సినిమా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్‌లు ఆగాయి. ఏప్రిల్‌నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో? మరి ‘మాస్టర్‌’ చెప్పిన ప్రకారం ఏప్రిల్‌ 9న వస్తాడా? వాయిదా పడతాడా? చూడాలి.

మరిన్ని వార్తలు