సైనికులపై ఉగ్రదాడి:20 మంది మృతి

4 Jun, 2015 16:00 IST|Sakshi
సైనికులపై ఉగ్రదాడి:20 మంది మృతి

ఇంపాల్ : మణిపూర్లో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  మోతుల్ నుంచి రాజధాని ఇంపాల్ వైపు  వస్తున్న మిలిటరీ కాన్వాయ్పై కొందరు గుర్తుతెలియని  మిలిటెంట్లు విరుచుకుపడ్డారు.   

 

గురువారం ఉదయం  జరిగిన ఈ దాడిలో  ఇరవైమంది సైనికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పాయారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

కాగా  ఒక మహిళను అస్సాం రైఫిల్స్ గ్రూపు హత్య చేసిందనే ఆరోపణలతో చందేల్ జిల్లాలో  గురువారం బంద్ జరుగుతోంది.

మరిన్ని వార్తలు