లోయలోపడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం

20 Jun, 2015 16:04 IST|Sakshi
లోయలోపడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం

అల్మోరా: ఉత్తరాఖండ్ పర్వత శ్రేణుల్లోని పర్యాటక ప్రాంతం అల్మోరాలో శనివారం మద్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దాదాపు 50 మంది ప్రయాణికులతో పితోరాగఢ్ నుంచి ఢిల్లీ  వెళుతోన్న ఓ బస్సు లోయలోకి పడిపోవడంతో 15 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు