24 గంటల్లో 279 మంది మృతి

10 Jun, 2020 09:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రోజులు గడుస్తున్న కొద్దీ దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,985 కేసులు నమోదు కాగా, 279 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,583కి చేరగా.. మృతుల సంఖ్య 7,745కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,33,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 1,45,216 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 50,61,332గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నిర్ధారణ అయ్యాయి. (వూహాన్‌ను అధిగమించిన ముంబై)

>
మరిన్ని వార్తలు