ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి

3 Jun, 2017 08:00 IST|Sakshi

డిండోరి: మధ్యప్రదేశ్‌లోని డిండోరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 30 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సివుంది.

మరిన్ని వార్తలు