ఏడు కేజీల బంగారంతో నది దాటుతూ..

20 Jul, 2017 19:50 IST|Sakshi
ఏడు కేజీల బంగారంతో నది దాటుతూ..

కోల్‌కతా: అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని బీఎస్‌ఎఫ్‌ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద నుంచి రూ. 2 కోట్ల విలువైన 7 కిలోల 60 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమబెంగాల్‌, 24 పరగణ జిల్లాలోని హకీంపుర ప్రాంతంలో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా దేశ సరిహద్దు దాటుతున్న ఓ వ్యక్తిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

రెండు దేశాల మధ్య ఉన్న సోనాయి నదిని ఓ తాడు సాయంతో అతడు దాటుతున్న సమయంలో అదుపులోకి తీసుకున్నాయి. తర్వాత అతడి వద్ద ఉన్న ప్లాస్టిక్‌ సంచిని తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో బంగారం కనిపించింది. ఆ బంగారం ఏడు కేజీల వరకు ఉంటుందని, దాని విలువ రూ.2కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు.

 

మరిన్ని వార్తలు