లక్నో: ఉత్తర ప్రదేశ్ లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అధికార సమజ్ వాది పార్టీకి చెందిన బిలారి ఎమ్మెల్యే ఇర్ఫాన్ అలీ గాయపడ్డారు. బదౌని జిల్లా కచ్లాఘాట్ దగ్గర ఆయన కారు పల్టీ కొట్టింది. సైఫాకి కారులో ప్రయాణిస్తుండగా ఆయన వాహనం బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఎమ్మెల్యే ఇర్ఫాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.