బుద్ధగయలో పేలుళ్లు తీవ్రవాదుల పనే: గోస్వామి

7 Jul, 2013 14:43 IST|Sakshi
అనిల్ గోస్వామి

బుద్ధగయలోని మహాబోధి ఆలయంలో వరుస బాంబు పేలుళ్లు తీవ్రవాదుల పనేనని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి తెలిపారు. పేలుళ్ల ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బలగాలను బుద్ధగయకు పంపామని ఆయన చెప్పారు.

అయితే ఈ దుశ్చర్యకు తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించుకోలేదని ఆయన వెల్లడించారు. బీహార్ లోని బుద్ధగయలోని మహాబోధి ఆలయ సముదాయం, వెలుపల జరిగిన 9 వరుస బాంబు పేలుళ్లలో ఇద్దరు బౌద్ధవులు గాయపడ్డారు.  

బుద్ధగయలోని మహాబోధ ఆలయంలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత్- నేపాల్ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేశారు. దేవిపటాన్ సహా ఇతర ఆలయాలకు భద్రత పెంచారు. పాట్నాకు మహావీర్ ఆలయానికి కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.

మరిన్ని వార్తలు