భూకంప మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా

26 Apr, 2015 15:51 IST|Sakshi

న్యూఢిల్లీ: భూకంపంలో మరణించినవారి కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల ఆర్ధికసాయాన్ని ప్రకటించింది. నేపాల్ సరిహద్దు రాష్ట్రమైన బీహార్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రంలో భూకంపం వల్ల ఇళ్లు, గోడలు కూలిన ఘటనల్లో 47 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్ లో 17, బెంగాల్ లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మొత్తంమీద భూకంపం ధాటికి భారత్‌లో 67 మంది చనిపోగా, 240 మందికి పైగా గాయపడ్డారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు.

మరిన్ని వార్తలు