795 మందికి పతకాలు

25 Jan, 2018 03:09 IST|Sakshi

పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవ పతకాలు ప్రకటించిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 795 మంది పోలీసు అధికారులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. ఇందులో 107 మంది అధికారులకు శౌర్య పతకాలు, 75 మందికి రాష్ట్రపతి పతకాలు, 613 మంది అధికారులకు విశిష్ట సేవా పతకాలు దక్కాయి. రాష్ట్రం నుంచి ఆరుగురికి శౌర్య పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు, 13 మందికి విశిష్ట సేవా పతకాలు దక్కాయి. 

రాష్ట్రపతి పతకాలు.. 
1. జితేందర్‌–ఏడీజీపీ ఆర్‌బీవీఆర్‌ఆర్‌ హైదరాబాద్, 2.నారాయణరావు చుంగి–డీఎస్పీ హైదరాబాద్‌.
విశిష్ట సేవా పతకం.. 
1. మస్తిపురం రమేశ్, గ్రూప్‌ కమాండర్, గ్రేహౌండ్స్‌. 2. డి.శివప్రసాద్‌రెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్, టీఎస్‌ఎస్పీ. 3. పి.వీరాస్వామి, అసిస్టెంట్‌ కమాండెంట్, హైదరాబాద్‌. 4.ఎస్‌.రంగారావు, ఏసీపీ, హైదరాబాద్‌. 5.తుల్జారామ్‌ నరేందర్‌ సింగ్, డీఎస్పీ, హైదరాబాద్‌. 6.చెట్లూరు శ్రీనివాస శాంతి, ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్‌. 7.గెడ్డిపల్లి రణవీర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్‌. 8.పల్లె శంకర్‌రెడ్డి, సబ్‌ ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్‌. 9.ఎండీ ఫయాజ్‌ అహ్మద్‌ షరీఫ్, ఏఆర్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్‌. 10. వేమూరి శివానందరావు, హెడ్‌ కానిస్టేబుల్, హైదరాబాద్‌. 11. రాథోడ్‌ రోహిదాస్‌ నాయక్, ఏఏసీ హెచ్‌సీ, హైదరాబాద్‌. 12.పి.శ్రీనివాస్, జూనియర్‌ కమాండో, హైదరాబాద్‌. 13. ఎం.సిద్ధయ్య, హెడ్‌ కానిస్టేబుల్, హైదరాబాద్‌.

పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంటరీ 
జి.సురేశ్‌–జేసీ, ఎం.మురళి – జేసీ, బి.శ్రీరాములు–ఏఏసీ, వెంకట శ్రీనివాస్‌ రెడ్డి–ఏఏసీ, పి.లక్ష్మణుడు–జేసీ, హరీశ్‌–జేసీ 

మరిన్ని వార్తలు