‘నారాయణ, చైతన్య’లపై సీఐడీ దాడులు

16 Apr, 2016 04:15 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని పలు ప్రైవేటు కళాశాలలపై సీఐడీ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. ద్వితీయ పీయూసీ రసాయన శాస్త్రం ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు. బెంగళూరు, బళ్లారిలోని నారాయణ, చైతన్య కళాశాలలతోపాటు తుమకూరు, మంగళూరులో ఉన్న మొత్తం 11 ప్రైవేటు కళాశాలల్లో సోదాలు చేశారు. దాడుల్లో ప్రశ్నపత్రం లీకుకు సంబంధించి పలు ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  
 

మరిన్ని వార్తలు