♦ ఇప్పటికే ఐదు మెగావాట్లతో సోలార్ప్లాంట్
♦100 మెగావాట్ల విండ్ పవర్ రెడీ
♦ ఏర్పాటవుతున్న మరో రెండు ప్లాంట్లు
పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి పవర్ హబ్గా మారుతోంది. ఇప్పటికే మండల పరిధిలోని కాళ్లాపూర్ శివారులో ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సౌర వెలుగులు ప్రారంభమయ్యాయి. కొత్తగా మరో రెండు సోలార్ప్లాంట్ల నిర్మాణం అవుతోంది. వీటిల్లో నూతన టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కాళ్లాపూర్ శివారులో ఏడాది క్రితం ప్రారంభమైన సోలార్ పవర్ జనరేటింగ్ ప్లాంట్లో ఉత్పత్తి అయిన విద్యుత్ను ఆ సంస్థ యూనిట్కు రూ.5.60 చొప్పున ప్రభుత్వానికి విక్రయిస్తోంది. ఆ ప్లాంటు కంటే రెండింతల సామర్థ్యం ఉన్న మరో రెండు సోలార్ ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ 11.2 మెగావాట్లతో నస్కల్ శివారులో ఒకటి, 10 మెగావాట్ల సామర్థ్యంతో బర్కత్పల్లి శివారులో మరోటి ఏర్పాటు చేస్తోంది. నస్కల్ శివారులోని ప్లాంటు పనులు పూర్తి కావడంతోపాటు ట్రయల్ రన్ సైతం నిర్వహించారు. ఈ వారంలో ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
వరుసగా వస్తున్న ప్రాజెక్టులు: జిల్లాలో ఎక్కడాలేని విధంగా పరిగికి ఒకటి తరువాత ఒకటి ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయి. మండలంలో రూ. 600 కోట్లతో 100 మెగావాట్ల సామర్థ్యంతో మొదటిసారిగా నూతన టెక్నాలజీతో విండ్ పవర్ (పవన విద్యుత్) ప్రాజెక్టు విద్యుదుత్పత్తికి సిద్ధమైంది. ఇప్పటికే రూ.40 కోట్లతో ఐదు మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి సంవత్సర కాలంగా కొనసాగుతోంది. నస్కల్ శివారులో రూ.100 కోట్లతో 11.2 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. రూ.100 కోట్లతో 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో మరో సోలార్ ప్లాంటు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో మొత్తంగా దాదాపు 145 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఇప్పటికే పరిగిలో 220 నిర్మాణం పూర్తికాగా 400 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటుకు గతంలో భూమిపూజ చేశారు.
సరికొత్త టెక్నాలజీతో..
ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న నస్కల్ శివారులోని సోలార్ పవర్ ప్రాజెక్టులో ఇప్పటి వరకు వాడని కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. గతంలో ఫ్లాట్ సిస్టం సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయగా ఇందులో ఆటోమేటిక్ రేడియేషన్ ట్రాకింగ్ సిస్టంతో పనిచేసే సోలా ర్ పలకలు ఏర్పాటు చేశారు. ఈ పలకలు సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు ఆటోమేటిక్గా (పొద్దుతిరుగుడు పువ్వులా) తిరుగుతాయి. దీంతో రోజంతా నాణ్యమైన ఎక్కువ మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలవుతుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో ఒక్కో మెగావాట్కు అదనంగా రెండువేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు.
పరిగి.. పవర్ హబ్గా పెరిగి..
Published Sat, Apr 16 2016 4:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement