ఈసీని కలిసిన కోమటిరెడ్డి, సంపత్‌

20 Apr, 2018 11:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఓపీ రావత్‌ను కలిశారు. ఈ సందర్భంగా శాసన సభ్యత్వాల రద్దును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను అందచేశారు. అప్రజాస్వామిక రీతిలో తెలంగాణ ప్రభుత్వం తన సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేయడాన్ని ఈసీకి వివరించారు. రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి, సంపత్‌తో పాటు మర్రి శశిధర్‌ రెడ్డి కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు