మాజీ న్యాయమూర్తి కట్జూపై డీఎంకే మండిపాటు!

22 Jul, 2014 13:38 IST|Sakshi
మాజీ న్యాయమూర్తి కట్జూపై డీఎంకే మండిపాటు!
చెన్నై: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూపై డీఎంకే పార్టీ మండిపడింది. కట్జూ ఆరోపణల్లో వాస్తవం లేదని డీఎంకే స్పష్టం చేసింది. అవినీతికి పాల్పడిన న్యాయమూర్తి కోసం యూపీఏ భాగస్వామిగా ఉన్న తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ పార్టీ లాబీయింగ్ చేసిందని కట్జూ ఆరోపణలన్ని అభూత కల్పన అని డీఎంకే నేతలు తెలిపారు. 
 
కట్లూ చేసి ఆరోపణల్ని డీఎంకే పట్టించుకోవడం లేదన్నారు. తమ పార్టీ పేరు చెప్పలేదని.. అంతేకాకుండా న్యాయమూర్తి పేరు కూడా కట్జూ వెల్లడించలేదని డీఎంకే నేత టీకేఎస్ ఎలాంగోవన్ అన్నారు. కట్జూ వ్యాఖ్యల్ని అధినేత కరుణానిధి దృష్టికి తీసుకువెళ్తామని ఎలాంగోవన్ తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు