మళ్లీ అంటుకున్న మంటలు

9 Dec, 2019 08:40 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం

సోమవారం ఉదయం అదే భవనంలో మరో అగ్నిప్రమాదం

నిన్నటి ప్రమాదంలో 43మంది మృతి

సాక్షి, న్యూఢిల్లీ:  43 మందిని పొట్టన పెట్టుకున్న అగ్నిప్రమాద విషాద ఛాయలు ఇంకా వీడక ముందే దేశ రాజధానిలో మరో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. ఉత్తర ఢిల్లీలోని రాణి ఝాన్సీరోడ్డులో అనాజ్‌ మండీ ప్రాంతంలో సోమవారం ఉదయం మరోసారి మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక  శకటాలు, సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు.  దీనిపై మరింత  సమాచారం అందాల్సి వుంది. 

 చదవండి : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

మరిన్ని వార్తలు