కొన్ని విషయాలు చెప్పాలంటే పేజీలకు పేజీల రాతలు అక్కర్లేదు. కేవలం కొన్ని సెకన్ల వీడియో చాలు. అందుకు టెక్ దిగ్గజం, మహింద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియో నిదర్శనంగా చెప్పవచ్చు. ఆయన షేర్ చేసిన ఎమోషనల్ వీడియో కొంతమందిలో స్ఫూర్తిని నింపితే, మరికొందరిని కంటతడి పెట్టిస్తోంది. 'ఈ ఉద్వేగభరితమైన వీడియోను చూడలేకపోయాను. కానీ ఈ వీడియో చూసిన తర్వాత కూడా ప్రపంచంలో పని కష్టమైనది కాదని భావిస్తానంటూ' ఆనంద్ మహీంద్ర ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఇద్దరు చిన్నారులు పార్కులో జారుడు బల్లపై ఊగాలనుకున్నారు. ఓ బాలిక మాత్రం హ్యాపీగా పదే పదే జారుడు బల్ల ఎక్కి ఆడుతోంది. రెండు కాళ్లు, చేతులు లేని మరో చిన్నారి కూడా అంతే ఉత్సాహంతో జారుడుబల్లపైకి ఎక్కుతోంది. అందుకోసం ఆ చిన్నారి చేస్తున్న ప్రయత్నాన్ని ఎవరో వీడియో తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయగా.. ఆ చిన్నారి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ సెలబ్రిటీలు, ఆయన ఫాలోయర్లు వీడియోను రీట్వీట్ చేయడంతో వైరల్ అవుతోంది.
At first I couldn't bear to look & then I was left feeling uplifted. I don't think I will ever complain again about any job being too hard.. pic.twitter.com/06mzMAxxjp
— anand mahindra (@anandmahindra) 11 September 2017