లోక్సభ ఎన్నికల్లో పోటీచేయను: రబ్రీదేవి

6 Oct, 2013 14:55 IST|Sakshi
లోక్సభ ఎన్నికల్లో పోటీచేయను: రబ్రీదేవి

వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో పోటీచేయబోనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి చెప్పారు. ఎన్నికల్లో తాను కానీ తన కుమార్తె మీసా భారతి కానీ పోటీ చేసేదిలేదని ఆదివారం స్పష్టం చేశారు.

బీహార్లోని సరన్ లోక్సభ నియోజకవర్గానికి లాలూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాణా కుంభకోణంలో ఆయనకు జైలు శిక్ష విధించడంతో ఎంపీగా అనర్హత వేటుపడనుంది. ఈ నేపథ్యంలో సరన్ నుంచి రబ్రీదేవి పోటీచేస్తారని వచ్చిన వార్తల్ని ఆమె తోసిపుచ్చారు. లాలూ జైల్లో ఉన్నా ఆర్జేడీకి సారథ్యం కొనసాగిస్తారని రబ్రీదేవి పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు