ఆధునిక బ్రహ్మాస్ క్షిపణి పరీక్ష విజయవంతం

8 Jul, 2014 16:06 IST|Sakshi

బలాసోర్: భారత్ రక్షణ రంగంలో మరో ముందడుగు వేసింది. 290 కిలో మీటర్ల పరిధి గల ఆధునిక బ్రహ్మాస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి దాదాపు 500 సెకన్లలోనే  లక్ష్యాన్ని ఛేదించింది. మంగళవారం ఒడిశా సముద్రతీర ప్రాంతం చాందీపూర్ క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించినట్టు బ్రహ్మాస్ చీఫ్ శివథాను పెళ్లై చెప్పారు.

పర్వతాలలో, భవంతులలో  దాక్కున్న శత్రువుల స్థావరాలను వంద శాతం కచ్చితత్వంతో ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ క్షిపణి ప్రత్యేకత. 300 కిలోల పేలుడు పదార్థాన్ని మోసుకుపోగల సామర్థ్యం ఉంది. బ్రహ్మాస్, డీఆర్డీఓ వాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు