గుండెపోటుతో ఐపీఎస్ అధికారి మృతి

18 Feb, 2016 14:35 IST|Sakshi

చెన్నై: ఐపీఎస్ అధికారి గుండెపోటుతో మృతిచెందిన ఘటన చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఎన్ హరీష్ మదురైలో ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయనను మదురై నుంచి చెన్నైకు తమిళనాడు ప్రభుత్వం బదిలీ చేసింది. ఎగ్మూర్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్లో గురువారం ఉదయం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందాడు. హరీష్ 2009 బ్యాచ్కు చెందిన ఐపీస్ అధికారి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు