పరీకర్‌ విధానాలే కొనసాగుతాయి: జైట్లీ

15 Mar, 2017 02:58 IST|Sakshi
పరీకర్‌ విధానాలే కొనసాగుతాయి: జైట్లీ

న్యూఢిల్లీ: రక్షణ మంత్రిగా తాను అదనపు బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆశాఖ మంత్రిగా మనోహర్‌ పరీకర్‌ అమలు చేసిన విధానాలనే కొనసాగిస్తానని ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టం చేశారు. రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మనోహర్‌ పరీకర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్తున్న నేపథ్యంలో ఆశాఖ బాధ్యతలను మంగళవారం అరుణ్‌జైట్లీ చేపట్టారు.

గతంలోనూ 2014 మే నుంచి నవంబర్‌ వరకు జైట్లీ రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.  పరీకర్‌ తన విధుల్ని ఎక్కడ విడిచి పెట్టారో అక్కడి నుంచి తాను కొనసాగిస్తానన్నారు. 

మరిన్ని వార్తలు