కూతురి నిశ్చితార్థం రద్దు.. విలేకరి విరాళం

17 Aug, 2018 21:50 IST|Sakshi

తిరువనంతపురం : వరుణుడి ఉగ్రరూపానికి కేరళ ప్రజలు పిట్టాల్లా రాలిపోతున్నారు. వందేళ్ల చర్రితలో ఎన్నడూలేని విధంగా వరదల దాటికి శుక్రవారం నాటికి 326 మంది మృతి చెందినా వరుణుడు కనీసం కనికరం చూపించట్లేదు. ఈ నేపథ్యంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా అనేక మంది ముందుకు వస్తున్నారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఓ విలేకరి నిజమైన మానవత్వాన్ని చాటాడు. తన కూతురి నిశ్చితార్థం కోసం దాచిన డబ్బును కేరళ వరద బాధితులకు సహాయం చేశారు.

కేరళకు చెందిన మనోజ్‌ అనే విలేకరి కుమారై వివాహం త్వరలో జరగాల్సి ఉంది. కాగా ఈ నెల 19న కుమార్తె నిశ్చితార్థం జరగనుంది. ఈ నేపథ్యంలో ఒ వైపు తన రాష్ట్ర ప్రజల వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. తన కుటుంబం వివాహ వేడుకలు చేసుకోవడం సబబు కాదనుకున్నాడు. ఈ మేరకు వరుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిశ్చితార్థం రద్దు చేసుకున్నాడు. అంతేకాకుండా వివాహం కోసం దాచిన డబ్బును వరుడి అనుమతితో ముఖ్యమంత్రి సహయ నిధికి విరాళంగా చెల్లించాడు.

మరిన్ని వార్తలు