'ఆయన అలా అన్నారంటే.. ఏదో బాధపెట్టే ఉంటుంది'

25 Nov, 2015 13:05 IST|Sakshi
'ఆయన అలా అన్నారంటే.. ఏదో బాధపెట్టే ఉంటుంది'

లక్నో: భారత్లో అసహన పరిస్థితులు ఉన్నాయంటూ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల విషయంలో సమాజ్ వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ కాస్త సానుకూలంగా స్పందించారు. ఏదో విషయం ఆయనను బాధపెట్టి ఉంటుందని, అందుకే అమీర్ చెప్పి ఉంటారని అన్నారు. ఈ దేశంలో ఎవరికి ఏమనిపించినా చెప్పే హక్కు ఉందని చెప్పారు.

అమీర్ ఖాన్ ఓ పెద్ద నటుడని, కేంద్రప్రభుత్వం ఆయనతో ఒకసారి మాట్లాడి అసలు విషయం అడిగి తెలుసుకొని అర్థం చేసుకుంటే మంచిదని, ఆయన ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరారు. దేశంలో ఆరు నెలలుగా అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయని, తమ పిల్లల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన చెందుతోందని, దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని అమీర్‌ ఖాన్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెను ధుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయా పార్టీకు చెందిన అగ్ర నేతలతో పాటు కొందరు సెలబ్రిటీలు కూడా స్పందించారు.

మరిన్ని వార్తలు