ఇక ఆన్‌లైన్‌లో పీఎఫ్ చెల్లించొచ్చు

2 Apr, 2014 02:20 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యవస్థీకృత రంగంలోని కంపెనీలు తమ ఉద్యోగుల ఫీఎఫ్ చందాల డబ్బును ఇకపై ఏ బ్యాంకు ద్వారానైనా ఆన్‌లైన్‌లోనే భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో)కు చెల్లించేందుకు వీలు కానుంది. ప్రస్తుతం ఎస్‌బీఐలో ఉద్యోగుల ఖాతాలున్న కంపెనీల నుంచి మాత్రమే పీఎఫ్ డబ్బులను ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌వో స్వీకరిస్తోంది. మరో ఆరు నెలల్లో ఎస్‌బీఐ యేతర బ్యాంకుల్లో ఖాతాలున్న ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు కూడా ఆన్‌లైన్‌లో స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖకు ఈపీఎఫ్‌వో ఓ లేఖలో తెలిపింది.

>
మరిన్ని వార్తలు