పాకిస్థానీ మిస్సింగ్.. ఢిల్లీలో అలర్ట్

9 Aug, 2016 15:25 IST|Sakshi
పాకిస్థానీ మిస్సింగ్.. ఢిల్లీలో అలర్ట్

న్యూఢిల్లీ: పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో కనిపించకుండా పోయాడు. ఓ హోటల్ లో దిగిన అతడు అనూహ్యంగా మాయమయ్యాడు. హోటల్ సిబ్బంది ఈ విషయం చెప్పడంతో పోలీసులు అప్రమత్తత ప్రకటించారు. గత నెల జూలై 22న 140 మంది పాకిస్థానీయులు ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతంలో దిగారు. వీరిలో మహ్మద్ సలీం అనే వ్యక్తి కూడా ఉన్నాడు.

సరిగ్గా వారు జూలై 27నాటికి తిరిగి వెళ్లాల్సి ఉంది. అయితే, మిగితా వారంతా ఉన్నప్పటికీ ఒక్క సలీం మాత్రం తన సామానుతో సహా కనిపించకుండాపోయాడు. ఇప్పటికే ఉగ్రవాద అలజడి దేశ రాజధానిలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమై అతడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉన్న నేపథ్యంలో పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు