ఆధార్‌తో లింక్‌ కాని పాన్‌కార్డుల రద్దు!

4 Dec, 2017 05:17 IST|Sakshi

న్యూఢిల్లీ: పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడంపై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తే వీటి అనుసంధానానికి 3 నుంచి 6 నెలల గడువిస్తామని కేంద్రానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ గడువు అనంతరం ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌ కార్డులన్నింటినీ రద్దు చేస్తామని మీడియాకు వెల్లడించారు.  దేశవ్యాప్తంగా ప్రస్తుతం 33 కోట్ల పాన్‌ కార్డులు ఉంటే..13.28 కోట్ల మంది తమ పాన్‌ కార్డుల్ని ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు