అంబేడ్క‌ర్ ఇంటిపై దాడి

8 Jul, 2020 09:25 IST|Sakshi

సాక్షి, ముంబై: రాజ్యాంగ సృష్టిక‌ర్త‌ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌‌ర్ గృహంలో గుర్తు తెలియ‌న దుండ‌గులు ప్ర‌వేశించి దాడి చేశారు. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. ముంబైలోని అంబేడ్క‌ర్ గృహం రాజ్‌గృహ‌లో మంగ‌ళ‌వారి రాత్రి గుర్తు తెలియ‌ని దుండ‌గులు లోనికి చొర‌బ‌డ్డారు. చెట్ల కుండీల‌ను ప‌గ‌ల‌గొడుతూ, సీసీటీవీ కెమెరాల‌ను ధ్వంసం చేస్తూ తోట‌, వ‌రండాలో బీభ‌త్సం సృ‌ష్టించారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌హారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ద‌ర్యాప్తుకు ఆదేశించారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. మ‌రోవైపు ఈ విష‌యం తెలుసుకున్న ఆందోళ‌న‌కారులు నేడు (బుధ‌వారం) నిర‌స‌న చేప‌ట్ట‌నున్నారు. అంబేడ్క‌ర్ వార‌సులు ప్ర‌కాశ్ అంబేడ్క‌ర్, భీమ్‌రావ్ అంబేడ్క‌ర్ ఈ దాడి గురించి‌ స్పందిస్తూ ప్ర‌జ‌లు స‌హ‌నం పాటించాల‌ని కోరారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నార‌ని ఎవ‌రూ రాజ్‌గృహ ద‌గ్గ‌ర గుమిగూడ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. (అంబేడ్కర్‌ పత్రికకు వందేళ్లు)

 


 

చ‌ద‌వండి: కుల నిర్మూలనతోనే భవిష్యత్తు

మరిన్ని వార్తలు