దేశ ప్రజలకు రాష్ట్రపతి వినాయకచవితి శుభాకాంక్షలు

28 Aug, 2014 18:17 IST|Sakshi
దేశ ప్రజలకు రాష్ట్రపతి వినాయకచవితి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ పేరిట రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. విదేశాల్లో, భారత దేశంలో ఉన్న ప్రజలందరికి నా శుభాకాంక్షలు అని తన సందేశంలో ప్రణబ్ తెలిపారు. 
 
విజ్క్షానం, సంపద, అదృష్టానికి వినాయకుడు ప్రతిరూపమని తన సందేశంలో పేర్కొన్నారు. దేశం పురోగతి చెంది.. అభివృద్ధికి ఆటంకాలు తొలగాలని ప్రణబ్ ముఖర్జీ తన సందేశంలో భగవంతుడిని ప్రార్ధించారు. 
మరిన్ని వార్తలు