మంటల్లో హోటల్‌.. ఏడుగురు మృతి!

21 Dec, 2016 13:01 IST|Sakshi
మంటల్లో హోటల్‌.. ఏడుగురు మృతి!

గోండియా: మహారాష్ట్రలోని గోండియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఓ హోటల్‌లో మంటలు చెలరేగాయి. కిచెన్‌లో గ్యాస్‌ సిలిండర్‌లు పేలడంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. పలువురు హోటల్‌లోనే చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ప్రమాద స్థలానికి చెరుకున్న అగ్ని మాపక సిబ్బంది 15 ఫైర్‌ ఇంజిన్లతో మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు చెలరేగిన హోటల్‌ నుంచి ఓ వ్యక్తి నిచ్చెన సహాయంతో మరో బిల్డింగ్‌ మీదకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

మరిన్ని వార్తలు