టాయిలెట్ కట్టించలేదని విద్యార్థిని ఆత్మహత్య

5 Jul, 2015 00:18 IST|Sakshi

జార్ఖండ్: ఇంట్లో టాయిలెట్ కట్టించాలన్న తన విన్నపాన్ని తల్లిదండ్రులు పట్టించుకోలేదని మనస్తాపంతో ఓ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రం దుంకా పట్టణానికి చెందిన ఖూబు కుమారి(17)  శుక్రవారం ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

తన కువూర్తె వివాహం చేసుకునే ముందే టాయిటెల్ కావాలనుకుందని కుమారి తల్లి సంజూ దేవి తెలిపింది. అయితే ఆర్థిక కారణాలచేత కట్టించలేకపోయామని వాపోయింది.
 

మరిన్ని వార్తలు