గ్రూప్ - 1 పరీక్షపై సుప్రీం తీర్పు

29 Jun, 2016 13:15 IST|Sakshi

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ -1 పరీక్షపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా ఏపీపీఎస్సీ, టీస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ పరీక్షల ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. 2011 నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా పాత సిలబస్ ప్రకారం కూడా తెలంగాణ పరీక్ష నిర్వహించుకోవచ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది.

మరిన్ని వార్తలు