నేపాల్‌లో ప్రమాదం.. ఇద్దరు భారతీయుల మృతి

11 Jun, 2019 15:30 IST|Sakshi

కాట్మండు : నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మృతిచెందగా, 21 మందికి గాయాలయ్యాయి. రౌతాహత్‌ జిల్లాలో భారత యాత్రికులతో వెళుతున్న బస్సు పవురాయ్‌ అటవి ప్రాంతంలో ఓ ట్రక్కును ఢీకొట్టింది. జనక్‌పుర్‌ నుంచి కట్మాండు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. మృతులు ఒడిషాకు చెందిన బిజయ్‌ కుమార్‌ జెనా(52), చరణ్‌ బిషాల్‌ (54)లుగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

మరిన్ని వార్తలు